Telnagana News: ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. 80 స్థానాల్లో గెలుపే లక్ష్యం: మాణికం ఠాగూర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, కోమటిరెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. దీనిపై విస్తృతంగా చర్చించాం. సిరిసిల్లలో ఏర్పాటుచేసే రాహుల్ గాంధీ సభపైనా చర్చించాం. మిషన్ తెలంగాణ మొదలైంది. ఏకాభిప్రాయంతోనే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. అందరితో కలిసి పని చేస్తాం. అన్ని కులాలను కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఒక్కరితో పార్టీ అధికారంలోకి రాదు. త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తాం. పార్టీలో చేరిన వాళ్లందరికీ టికెట్లు రావు’’ అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు.
ఆయన పార్టీకి నష్టం చేశారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
‘‘నేనేమీ అసంతృప్తిగా లేను. పార్టీలో చురుగ్గానే ఉన్నా. దేన్నీ పట్టించుకోను. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలి. పార్టీ అధిష్ఠానాన్ని ఇదే కోరుతున్నా. పీఏసీకి రాలేనని నేను ముందే చెప్పాను. 29 మందితో కమిటీ వేస్తే.. దానికి వెళ్లి నేనేం మాట్లాడతాను. పీఎసీలో కమిటీ సభ్యుల సంఖ్యను కుదించాలి. డాక్టర్ రవి చేరిక చెల్లకపోతే బిల్యా నాయక్ చేరిక ఎలా చెల్లుతుంది? బిల్యా నాయక్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి నష్టం చేశారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చట్టసభల్లో పవన్ గొంతు వినాలి: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!