Ap News: వైకాపా నేతలు, సినిమా వాళ్లు పరస్పరం దూషించుకోవడం సరికాదు: రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కలిసి అసోసియేషన్లతో చర్చలు జరిపి సినిమా

Published : 14 Jan 2022 11:37 IST

విజయవాడ‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కలిసి అసోసియేషన్లతో చర్చలు జరిపి సినిమా టిక్కెట్‌ రేట్ల వివాదానికి పరిష్కారం చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వైకాపా నేతలు, సినిమా వాళ్లు పరస్పరం దూషించుకోవడం సరికాదన్నారు. వ్యక్తులతో విడివిడిగా కాకుండా మూవీ ఆర్టిస్ట్స్, డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లు, థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు జరిపితేనే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై దృష్టిపెట్టిన విధంగానే సిమెంటు, ఇసుక, స్టీల్, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించాలని రామకృష్ణ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని