Andhra news: సీఎం జగన్ హిట్లర్ని మించిపోయారు: ధూళిపాళ్ల
సీఎం జగన్ హిట్లర్ని మించిపోయారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సీఎం పర్యటన అంటేనే స్థానిక ప్రజలు.......
అమరావతి: సీఎం జగన్ హిట్లర్ని మించిపోయారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సీఎం పర్యటన అంటేనే స్థానిక ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించేలా ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వాడటం దారుణమన్నారు. జనం తిరగబడతారనే భయంతోనే జగన్ ఎక్కడికి వెళ్లినా బారికేడ్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. త్వరలోనే ప్రజా తిరుగుబాటు తప్పదని, వైకాపాను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘పగ, విద్వేషం, విధ్వంసం, దోపిడీలతో జగన్ హిట్లర్ని మించిపోయానడంలో ఎలాంటి సందేహంలేదు. చరిత్రలో మనం చూశాం.. దొంగలు, బందిపోటు దొంగల్ని చూసి ప్రజలు భయపడేవారు. ఈరోజు ఏపీలో ప్రజానీకం సీఎం పర్యటన అంటేనే భయపడే పరిస్థితి. సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ డబుల్ బారికేడ్లు ఉంటాయి. దుకాణాలు మూసేస్తారు. వ్యాపారాలు మూసేస్తారు. బలవంతంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం ఒక ఎత్తయితే.. ఆ స్కూళ్ల నుంచి బలవంతంగా బస్సులు లాక్కొని జనాన్ని తరలించడానికి ఉపయోగిస్తున్నారు. సీఎం పర్యటనకు ప్రజలు రాకపోతే పథకాలు ఆపేస్తాం.. పెనాల్టీలు వేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ రకమైన దౌర్జన్యం కొనసాగుతోంది. జగన్ పర్యటనకు వెళ్తే అక్కడ కర్ఫ్యూ వాతావరణం కనబడుతుంది. ప్రజల్లోకి రావడానికి సీఎం భయపడుతున్నట్టు కనబడుతోంది’’ అని వ్యాఖ్యానించారు.
‘‘జగన్.. నీకు బలం, బలగం ఉన్న పులివెందులలో పోటీ చేయడం గొప్పా? తన సామాజిక వర్గంలేని చోట, బలగం, బంధువులు, పరివారం లేనిచోట చంద్రబాబు పోటీచేయడం గొప్పా? ఏదో గొప్పో చెప్పాలి. ఇది బీసీ సీటు అంటూ బీసీల గురించి ఈరోజు సీఎం కుప్పంలో చాలా మాట్లాడారు. బీసీలపై అంతప్రేమ ఉంటే చిత్తూరు జిల్లాలో మంత్రులెవరు? రెండూ నీ సామాజికవర్గానికే ఎందుకు ఇచ్చారు? ఒకవైపు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరోవైపు రోజారెడ్డికే మంత్రిపదవులు ఇచ్చారు. మరి అప్పుడు బీసీలు కనబడలేదా? కుప్పం వచ్చి బీసీ జపం చేస్తే జనం నమ్ముతారా?’’ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా