Dimple Yadav: భాజపా ఓటర్లను కోనేస్తోంది: డింపుల్ యాదవ్
ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురిలోక్సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో భాజపా నేతలు ఓటర్లను కొనేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని విమర్శించారు.
దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురిలోక్సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో భాజపా నేతలు ఓటర్లను కొనేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ఈమేరకు ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘ వందలాది మంది భాజపా నాయకులు, కార్యకర్తలంతా మెయిన్పురి స్టేషన్రోడ్డులోని పామ్ హోటల్కి చేరారు. అక్కడి నుంచే మద్యం, డబ్బును పంపిణీ చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి.’’ అంటూ డింపుల్ యాదవ్ హిందీలో ట్వీట్ చేశారు.
తానే స్వయంగా వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు భాజపా చర్యలకు వ్యతిరేకంగా పోలింగ్ ప్రారంభానికి ముందే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలంతా ధర్నాకు దిగే అవకాశముంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభస్థానానికి సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పాటు రామ్పూర్ సదర్, ఖతౌలి అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్కు కొన్ని గంటల ముందే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..