Kondru Murali: కేశినేని నాని తీరుని.. విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు: కొండ్రు మురళి
విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు’ ఉందని మాజీ మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు’ ఉందని మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుపై దారుణంగా విమర్శలు చేస్తారా? గత నాలుగేళ్లుగా కేశినేని తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. అయినా సరే చంద్రబాబు క్షమిస్తూ వచ్చారు. ఏనాడూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. నాని దూకుడు ఎక్కువ కావడంతో.. పార్టీ నాయకులను పంపించి తగ్గాలని మర్యాదగా చెప్పారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వభావం ఉన్న కేశినేని.. లోకేశ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సహించరానివి. యువగళం పాదయాత్ర సమయంలో నాని ఏమయ్యారు? పార్టీకి చెందిన బాధ్యతగల ఎంపీగా వ్యవహరించలేదు. వల్లభనేని వంశీ, కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలను ఒక్క సారైనా ఖండించారా? వైకాపా నేతలతో కుమ్మక్కై.. ప్రత్యేక అజెండాతో ముందుకెళ్లారు. నాని తీరుని విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!