Kondru Murali: కేశినేని నాని తీరుని.. విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు: కొండ్రు మురళి

విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు’ ఉందని మాజీ మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు.

Updated : 12 Jan 2024 18:17 IST

విశాఖపట్నం: విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు’ ఉందని మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుపై దారుణంగా విమర్శలు చేస్తారా? గత నాలుగేళ్లుగా కేశినేని తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. అయినా సరే చంద్రబాబు క్షమిస్తూ వచ్చారు. ఏనాడూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. నాని దూకుడు ఎక్కువ కావడంతో.. పార్టీ నాయకులను పంపించి తగ్గాలని మర్యాదగా చెప్పారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వభావం ఉన్న కేశినేని.. లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సహించరానివి. యువగళం పాదయాత్ర సమయంలో నాని ఏమయ్యారు? పార్టీకి చెందిన బాధ్యతగల ఎంపీగా వ్యవహరించలేదు. వల్లభనేని వంశీ, కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలను ఒక్క సారైనా ఖండించారా? వైకాపా నేతలతో కుమ్మక్కై.. ప్రత్యేక అజెండాతో ముందుకెళ్లారు. నాని తీరుని విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని