Supriya Sule: ఫడణవీస్ రాజీనామా చేయాలి.. సూలే డిమాండ్
మరాఠా రిజర్వేషన్ పోరాటంలో భాగంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆందోళన వ్యక్తంచేశారు.
దిల్లీ: మరాఠా వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు (Maratha reservation) కల్పించాలంటూ చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. బీడ్లో ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టడం.. మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తుకు నిప్పంటించి ధ్వంసం చేయడం వంటి ఘటనలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై సుప్రియా సూలే దిల్లీలో మీడియాతో మాట్లాడారు.
భగ్గుమన్న ‘మరాఠా కోటా’ ఆందోళనలు.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు!
‘‘మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేయాలి. ఈ హింసను చూడండి.. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? ఒక ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టారు. ఒక పంచాయతీ సమితి కార్యాలయాన్ని తగలబెట్టారు. ఎవరైనా శాంతిభద్రతల్ని కాపాడాలని చూస్తున్నారా?’’ అని సూలే ప్రశ్నించారు. మరాఠా సంఘం నిరసనల నేపథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న సీఎం ఏక్నాథ్ శిందే నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్ జరంగే అల్టిమేటం జారీ చేసిన 40 రోజుల తర్వాత సీఎం ఈ నిర్ణయం ప్రకటిస్తారా? అని విమర్శించారు. ఇది జరంగేతో పాటు అన్ని వర్గాల ప్రజలందరినీ ఇది మోసగించడం కాదా? ఒకదాని తర్వాత మరో కమిటీ ఏర్పాటు చేయడంలో అర్థమేంటి? అని సుప్రియా సూలే ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట