రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబ్యాలెట్ పెట్టండి:తెదేపా
తెదేపా శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,
ముగిసిన తెదేపా శాసనసభాపక్ష సమావేశం
అమరావతి: తెదేపా శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఎలాంటి వైఖరి అవలంబించాలనేదానిపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం తెదేపా శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్కు తాము కట్టుబడి ఉన్నామని.. రేపు సభలోనూ ఒకే రాజధాని..ఒకే అసెంబ్లీకి అనుకూలంగానే తమ వాదనను బలంగా వినిపిస్తామన్నారు. కార్యాలయాల తరలింపుతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఒరిగేదేమీ ఉండదన్నారు. విశాఖ ఇప్పటికే ఆర్థిక రాజధానిగా మారిందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ప్రజాగ్రహం ముందు ప్రభుత్వం ఆటలు సాగవన్నారు. వైకాపా మేనిఫెస్టోలో అమరావతి మార్పు గురించి చెప్పారా? అని సీఎం జగన్ను రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాబ్యాలెట్ ద్వారా అభిప్రాయాలను సేకరించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకానీ నిరంకుశంగా వ్యవహరిస్తూ రాజధాని మార్చే ప్రయత్నం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్