వాస్తవాలకు దూరంగా గవర్నర్ ప్రసంగం:భట్టి
ఉభయ సభలనుద్దేశించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగం వాస్తవాలకు దరిదాపుల్లో కూడా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ గవర్నర్ ప్రసంగంలో...
హైదరాబాద్: ఉభయ సభలనుద్దేశించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగం వాస్తవాలకు దరిదాపుల్లో కూడా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టత లేదని పేర్కొన్నారు. రెండు పడకల ఇళ్లపై ఆరేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మాట చెబతోందని భట్టి మండిపడ్డారు. పోడు భూములు, ఎస్సీ, ఎస్టీ నిధులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన రాలేదన్నారు. రుణమాఫీ, రైతుబంధు పథకాలు కేవలం ఎన్నికల ఆయుధాలుగా మారాయని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఇంటికీ నీరు రాలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లు పిలవకపోవడం.. నామినేషన్ పద్ధతిలో రూ. 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ఇవ్వడంపై అసెంబ్లీలో చర్చ జరపాలని భట్టి డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై చర్చించాలన్నారు. సమస్యల పరిష్కారంపై చర్చకు అసెంబ్లీ సమయాన్ని పొడిగించాలని భట్టి డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా