కూలీలను సొంతూళ్లకు పంపలేం: సుచరిత
లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్జోన్లలో నివసించే ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు అమరావతి సూపర్ మార్కెట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ సూపర్ మార్కెట్ను...
గుంటూరు: లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్జోన్లలో నివసించే ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు అమరావతి సూపర్ మార్కెట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ సూపర్ మార్కెట్ను ఆమె ప్రారంభించారు. వారికి ఆర్టీసీ బస్సులు సమకూర్చింది. ఈ సందర్భంగా హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెడ్ జోన్లలో ప్రజలు బయటకు వచ్చేందుకు వీలులేనందున వారి కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు భౌతిక దూరం పాటించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని అన్ని రెడ్ జోన్లలో ఇవి అందుబాటులో ఉంటాయని సుచరిత చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వలస కూలీలను సొంతూళ్లకు పంపే విషయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోలేమని హోంమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందున కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించారు. వారికి భోజన, వసతి పరంగా సమస్యలుంటే పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో సమస్యలున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ఆమె స్పందించారు. క్వారంటైన్ కేంద్రాల్లో సమస్యలున్న మాట వాస్తవమేనని.. ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం