‘ఆ జాబితా చాలా ఉంది.. ఎవరినీ వదలబోం’

చంద్రబాబు హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారందరినీ జైలుకు పంపుతామని వైకాపా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే అరెస్టు అయ్యారని.. మిగిలిన వారి అక్రమాలపై విచారణకు ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి

Published : 16 Jun 2020 01:24 IST

అమరావతి: చంద్రబాబు హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారందరినీ జైలుకు పంపుతామని మంత్రి అనిల్‌ అన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే అరెస్టు అయ్యారని.. మిగిలిన వారి అక్రమాలపై విచారణకు ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘‘అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి జాబితా చాలా ఉంది. వారెవరినీ వదలబోం. తెదేపా నేతల అరెస్టులపై జేసీ సహా నారా లోకేశ్‌ అతిగా విమర్శలు చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసి ఉంటే లోకేశ్‌ కూడా లోపలికి వెళ్తారు. చట్టం అందరికీ సమానం. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. ఎవరు చేసిన పాపం వారు అనుభవించాల్సిందే. తప్పు చేయలేదని చెబుతున్న వారంతా విచారణకు సహకరించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని మంత్రి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని