ఇంకెప్పుడు మేల్కొంటారు?: కపిల్ సిబల్
రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వేడి రాజుకున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంలో చురుకుగా వ్యవహరించాలని పార్టీని కోరారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలతో............
దిల్లీ: రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వేడి రాజుకున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో చురుకుగా వ్యవహరించాలని పార్టీని కోరారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి సచిన్ పైలట్ హస్తినకు చేరుకున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
‘‘మన గుర్రాలు కళ్లెం తెంపుకొని వెళ్లిపోయాక మేల్కొందామా?’’ అంటూ ఘాటుగా స్పందించారు. తన బాధ అంతా తమ పార్టీ గురించేనని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ అధినాయకత్వం చురుగ్గా వ్యవహరించలేకపోయిందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఇప్పుడు రాజస్థాన్లో సచిన్ పైలట్ వ్యవహారంలోనూ అదే రీతిలో పరిణామాలు జరుగుతున్న వేళ ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం మేల్కోవాలంటూ కపిల్ సిబల్ ట్వీట్ చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల