Padi Kaushik Reddy: హుజూరాబాద్లో భారాస అభ్యర్థిని నేనే: పాడి కౌశిక్రెడ్డి
రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిని తానేనని, మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం ఈ విషయం స్పష్టం చేశారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు.
రాంపూర్ (కరీంనగర్), న్యూస్టుడే: రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిని తానేనని, మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం ఈ విషయం స్పష్టం చేశారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ దిల్లీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడిస్తే తాము సహించమన్నారు. తనకు మహిళలంటే చాలా గౌరవమని..అయితే గవర్నర్ తీరు వల్లే విమర్శించానన్నారు.
శాసనసభలో ఆమోదం పొందిన రాష్ట్ర అభివృద్ధి బిల్లులను ఆపడంతో కడుపుమండి విమర్శలు చేశానని అన్నారు. తన భాషను విమర్శిస్తున్న భాజపా నాయకులు ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ మాట్లాడే భాషపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని త్వరలో మంత్రితో ప్రారంభింపజేస్తామని, దీనికి ఈటలను గౌరవంగా ఆహ్వానిస్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ఇంకెన్నాళ్లీ ప్రతిష్టంభన.. అడ్డంకులు సృష్టించొద్దు: ఓం బిర్లా
-
India News
Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
-
Sports News
MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TS High court: జూనియర్ లెక్చరర్ పరీక్షపై టీఎస్పీఎస్సీ నిర్ణయం సరికాదు: హైకోర్టు
-
World News
Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు