Andhra News: నా ఫోన్‌ కూడా నిఘాలో ఉందనుకుంటున్నా: ఎమ్మెల్సీ విఠపు

ప్రస్తుత పరిస్థితి చూస్తే తన ఫోన్‌ కూడా నిఘాలో ఉందనుకుంటున్నానని శాసనసభ పూర్వ ప్రొటెం స్పీకర్‌, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అనుమానం వ్యక్తం చేశారు.

Published : 06 Feb 2023 08:35 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితి చూస్తే తన ఫోన్‌ కూడా నిఘాలో ఉందనుకుంటున్నానని శాసనసభ పూర్వ ప్రొటెం స్పీకర్‌, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అనుమానం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన ఫోన్‌ కూడా నిఘాలోనే ఉందనుకుంటున్నానని అన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని