కాంగ్రెస్ లేకుండా భాజపాను ఎదుర్కోవడం అసాధ్యం.. జైరాం రమేశ్ వ్యాఖ్య
తమ పార్టీలేని ప్రతిపక్ష కూటమి భాజపాను ఎదుర్కోవడం అసాధ్యమని కాంగ్రెస్ స్పష్టంచేసింది. 2024 ఎన్నికలకు ఏదైనా కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు.
దిల్లీ: తమ పార్టీలేని ప్రతిపక్ష కూటమి భాజపాను ఎదుర్కోవడం అసాధ్యమని కాంగ్రెస్ స్పష్టంచేసింది. 2024 ఎన్నికలకు ఏదైనా కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ అంశంపై మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుందన్నారు. తమ దృష్టి అంతా రాబోయే కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలపైనే ఉందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లకు తాము సమదూరం పాటిస్తామని అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో రమేశ్ ఈ మేరకు స్పందించారు. అఖిలేశ్, మమతల చర్యలు ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తాయా? అన్న ప్రశ్నకు.. ‘టీఎంసీ, ఎస్పీ నేతలు సమావేశమవుతున్నారు. మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ ఏర్పాటు కొనసాగుతుంది. అయితే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ తప్పనిసరి’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!