మోదీ నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ
రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ఠ అని భారాస అధినేత, సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
రాహుల్ లోక్సభ సభ్యత్వ అనర్హతపై సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ఠ అని భారాస అధినేత, సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా.. అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటు కాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోంది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం భాజపా ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. భాజపా దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
బ్రిజ్భూషణ్కు యూపీ షాకిచ్చిందా..?వాయిదా పడిన ఎంపీ ర్యాలీ
-
Sports News
IPL 2023: ధోనీ మేనియాగా ఈ ఐపీఎల్ సీజన్ : రమీజ్ రజా
-
World News
Russia: రష్యాలో ఐఫోన్లపై అమెరికా ‘హ్యాకింగ్’..!
-
General News
CM Jagan: రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
YS bhaskar reddy: భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా