ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ సహకరించాలి
ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో భాజపాతో పోరాడటానికి జాతీయ పార్టీలు మద్దతివ్వాలని.. కాంగ్రెస్ను ఉద్దేశించి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.
అఖిలేశ్ యాదవ్ సూచన
లఖ్నవూ: ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో భాజపాతో పోరాడటానికి జాతీయ పార్టీలు మద్దతివ్వాలని.. కాంగ్రెస్ను ఉద్దేశించి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై అడిగిన ప్రశ్నకు ఆదివారం ఆయన సమాధానమిస్తూ.. ఆ పార్టీ సత్యాగ్రహం నిర్వహించడంపై అభినందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు.. రాహుల్ గాంధీపట్ల ఎస్పీ సానుభూతితో ఉందా? అనేది ఇక్కడ విషయం కాదని, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనగలుగుతాయా? లేదా? అనేదే ముఖ్యమని పేర్కొన్నారు. తాము ఏ పార్టీకీ సానుభూతి చూపబోమని స్పష్టం చేశారు. ‘భాజపాతో రాష్ట్ర స్థాయిలో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలి. కేంద్రంలోని ప్రభుత్వమే ప్రాంతీయ పార్టీలకు హాని కలిగించింది. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్నుశాఖలు ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకున్నాయి. ములాయంసింగ్, లాలుప్రసాద్, జయలలిత, స్టాలిన్, కేసీఆర్, దిల్లీలో ఆప్ పార్టీ నేతలందరూ కేంద్రంలోని పార్టీలకు లక్ష్యంగా మారారు’ అని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. ‘కూటమి ఏర్పాటుచేయడం తమ బాధ్యత కాదని, కూటమికి సహకారం అందించడమే తమ విధి’ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు