175 కాదు.. పులివెందులను కాపాడుకో జగన్‌

వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలుస్తామంటూ సీఎం జగన్‌ చేస్తున్న ప్రకటనలపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ..‘175కి 175 కాదు. సవాలు చేస్తున్నా... పులివెందులను కాపాడుకో.

Published : 28 May 2023 04:32 IST

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలుస్తామంటూ సీఎం జగన్‌ చేస్తున్న ప్రకటనలపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ..‘175కి 175 కాదు. సవాలు చేస్తున్నా... పులివెందులను కాపాడుకో. ప్రజలను మోసం చేసే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు’ అన్నారు.

‘ఈ మహానాడు తొలిరోజు సమావేశానికి 15వేల మందిని ఆహ్వానించాం. కానీ, లక్షకుపైగా వచ్చారు. అంటే నేను ఒకరిని పిలిస్తే ఏడుగురు వచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో వైకాపాకు దిమ్మ తిరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఇచ్చే సందేశం, మనం ఆలోచించుకునే విధానాన్ని 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలతో పాటు, తెలంగాణలోని ప్రజలకూ చేరవేసే బాధ్యత నాయకులదే’ అని చంద్రబాబు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని