ప్రారంభోత్సవమా.. పట్టాభిషేకమా..!
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన పట్టాభిషేకంలా భావించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.
రాజుల కాలం కాదిది
మతాచారాలతో దేశం వెనక్కి
కాంగ్రెస్ సహా విపక్షాల ధ్వజం
దిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన పట్టాభిషేకంలా భావించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఇది చక్రవర్తులు, రాజుల కాలం కాదంటూ ఆగ్రహించాయి. మత ఆచారాల పేరుతో దేశాన్ని భాజపా-ఆరెస్సెస్లు వెనక్కి తీసుకువెళుతున్నాయంటూ కార్యక్రమాన్ని బహిష్కరించిన 21 విపక్ష పార్టీలు ఆరోపించాయి. రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తూ.. ప్రారంభించాల్సిన హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కున్నారని ఆదివారం మండిపడ్డాయి. ‘‘పార్లమెంటు ప్రజల గొంతుక.. కానీ ప్రారంభోత్సవాన్ని తన పట్టాభిషేక కార్యక్రమంలా ప్రధాని భావించారు’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కున్నారు. నియంతృత్వ బలంతో క్రీడాకారిణులను వీధుల్లో కొట్టారు. భాజపా,ఆరెస్సెస్ ప్రవచించిన ప్రజాస్వామ్యం, జాతీయవాదం, కుమార్తెలను కాపాడండి అనే నినాదాలు అబద్ధాలన్న విషయం ఇప్పుడు ప్రజల ముందు బట్టబయలైంది’’ అని ఖర్గే పేర్కొన్నారు. పట్టాభిషేకం వ్యాఖ్యలపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సార్లు మోదీకి ప్రజలు అధికారం ఇచ్చారన్న విషయాన్ని రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాత్రం సెంగోల్పై వివాదం అనవసరమంటూ ట్వీట్ చేశారు.
నెహ్రూ ఆలోచనలకు వ్యతిరేకం: పవార్
పార్లమెంటు ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన మతపరమైన కార్యక్రమాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నెహ్రూ ఊహించిన ఆధునిక భారతానికి ఇది వ్యతిరేకమని అన్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మాత్రం కేంద్రానికి అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!