స్వతంత్రంగా పోటీచేసినా గెలుస్తానేమో
గత ఎన్నికల్లో తెదేపాతో పాటు ఇతర పార్టీల నుంచీ ఓట్లేస్తేనే తాను గెలిచానని, ప్రజలు ఆశీర్వదిస్తే స్వతంత్రంగా పోటీ చేసినా మళ్లీ గెలుస్తానేమోనని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు.
పిట్టల దొరలకు టికెట్ ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు
మైలవరం, న్యూస్టుడే: గత ఎన్నికల్లో తెదేపాతో పాటు ఇతర పార్టీల నుంచీ ఓట్లేస్తేనే తాను గెలిచానని, ప్రజలు ఆశీర్వదిస్తే స్వతంత్రంగా పోటీ చేసినా మళ్లీ గెలుస్తానేమోనని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. నమ్మిన ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పని చేస్తున్నానని, సంకుచిత ఆలోచనలతోనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పిట్టల దొర లాంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చినా తనకేమీ అభ్యంతరం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఎస్వీఆర్జీ నరసింహారావు హైస్కూల్కు ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన ప్రహరీని బుధవారం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఎయిర్ పోర్టులో తప్ప, కుటుంబ పనుల కోసం ఎంపీ పదవిని ఎప్పుడూ ఉపయోగించలేదన్నారు. తనకు ఏ పనైనా సాధించగల సత్తా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు లేవని, రెండు వేదికలకు నాయకులుగా ఉన్న చంద్రబాబు, జగన్ల మధ్యే వైరమని అభిప్రాయపడ్డారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు అభివృద్ధి పనుల విషయంలో కలిసి పనిచేయకూడదా అని ప్రశ్నించారు. తానేమీ శాశ్వతంగా ఎంపీ, ఎమ్మెల్యేగా ఉండిపోవాలనుకోవడం లేదని, 9 ఏళ్లలో సంతృప్తికరంగా సేవలందించానని ఆశాభావం వ్యక్తం చేశారు. మైలవరం జమీందారు విజ్ఞప్తి మేరకే పాఠశాలకు నిధులు కేటాయించానని, అభివృద్ధి పనుల కోసం ఎవరికైనా నిధులు ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఎంపీ కుటుంబం, తమ కుటుంబాల మధ్య దీర్ఘకాలిక అన్యోన్యత ఉందని, రాజకీయం వేరు, కుటుంబ బంధాలు వేరని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నానితో పాటు మరో ఎంపీ సుజనాచౌదరిని నిధులు అడిగానని వివరించారు. అనంతరం ద్వారకా తిరుమల ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు (ఎస్వీఎస్) కోటలో జరిగిన విందులో ఎంపీ, ఎమ్మెల్యే, ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!