VenkataRamana Reddy: కూల్డ్రింక్ షాపు యజమానికి అన్ని ఆస్తులెలా వచ్చాయి?
‘ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్కు ఆస్తులు లేవు సరే. చిన్నప్పటి నుంచి నువ్వు కూర్చునే కూల్డ్రింక్ షాపు యజమానికి అన్ని ఆస్తులెలా వచ్చాయి? ఆయన పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి? అని ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
ఈనాడు, నెల్లూరు: ‘ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్కు ఆస్తులు లేవు సరే. చిన్నప్పటి నుంచి నువ్వు కూర్చునే కూల్డ్రింక్ షాపు యజమానికి అన్ని ఆస్తులెలా వచ్చాయి? ఆయన పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి? ఆస్తి పత్రాల్లో ఉన్న చిరంజీవి ఎవరు? మీ పీఏ నాగరాజు సాక్షి సంతకం ఎందుకు పెట్టారు? వారు మీ మనుషులు కాదా?’ అని ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెదేపా జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చిరంజీవికి, ఎమ్మెల్యే అనిల్కు దగ్గరి సంబంధాలున్నాయని, విశాఖపట్నంలో చిరంజీవి పెళ్లికి ఎమ్మెల్యే హాజరయ్యారని ఆరోపించారు. దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెబితే ఆ పాపం కుటుంబాలకు తగులుతుందన్నారు. 2017 ఆగస్టులో క్రికెట్ బెట్టింగ్ కేసులో అనిల్ను ఎందుకు విచారించారో చెప్పాలన్నారు. బెట్టింగ్కు సంబంధం లేదంటున్న అనిల్, ఇటీవల తన బాబాయ్ రూప్కుమార్ పాపం మోస్తున్నానని చెప్పారని... వాస్తవానికి బాబాయ్, అబ్బాయ్ కలిసే ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ‘అనిల్కు ఇంటర్నేషనల్ నోటీసులు ఎందుకు వచ్చాయి? పెరూలో బంగారం వ్యాపారం ఉందో, లేదో బయటపెట్టాలి. ముదివర్తిపాళెం కాజ్వే పనులకు సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు కంపెనీతో టెండర్ వేయించలేదా? దొంగ బ్యాంకుగ్యారంటీతో టెండర్లు వేసిన విషయం వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ