వచ్చే నెలలో విశాఖకు రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే నెలలో విశాఖ ఉక్కు కర్మాగారానికి రానున్నారని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి తెలిపారు.

Updated : 18 Jul 2023 06:18 IST

విశాఖపట్నం (అక్కిరెడ్డిపాలెం), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే నెలలో విశాఖ ఉక్కు కర్మాగారానికి రానున్నారని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుందని జోడో యాత్ర సమయంలో రాహుల్‌గాంధీ పేర్కొన్నారని చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడకు వచ్చి ఉక్కు పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన వారికి మద్దతుగా మాట్లాడతారన్నారు. భాజపా ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి బడా వ్యాపారులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌, పవన్‌కల్యాణ్‌లకు భాజపాను ఎదుర్కొనే సత్తా లేదని, అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. రాహుల్‌ రాక నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా ఈ నెల 22న జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జింక్‌ గేటు నుంచి కూర్మన్నపాలెం దీక్షా స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని