MLA Shakeel: నా మీద కోపమున్నా సీఎం కేసీఆర్‌కు ఓటేయండి

ప్రజలు తమ ఓటును ఇతర పార్టీలకు వేసి వృథా చేసుకోవద్దని, కొందరికి తనమీద కోపమున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఓటువేసి మరోసారి ఆయన్ని సీఎం చేయాలని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ కోరారు.

Updated : 01 Sep 2023 07:24 IST

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలు తమ ఓటును ఇతర పార్టీలకు వేసి వృథా చేసుకోవద్దని, కొందరికి తనమీద కోపమున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఓటువేసి మరోసారి ఆయన్ని సీఎం చేయాలని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ కోరారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బీసీబంధు చెక్కులను, రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారాస బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వమని, బీసీ రుణాలు, గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడం పవిత్రకార్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలు అమలు కావడంలేదన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.3 వేల కోట్లతో బోధన్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం నందిగాం ఉప సర్పంచి వివేక్‌... ఎమ్మెల్యే సమక్షంలో భారాసలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీలు బుద్దె సావిత్రి(బోధన్‌), శ్రీనివాస్‌(ఎడపల్లి), జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి(బోధన్‌) తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని