Rajasthan: మీ గౌరవం చచ్చిపోయింది.. అందుకే గుండు చేయించుకొన్నా: సీఎంకు తల వెంట్రుకలు పంపిన ఎమ్మెల్యే
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్కు వ్యతిరేకంగా తరచూ ప్రకటనలు చేస్తూ వస్తున్న మాజీ మంత్రి, సాంగోద్ ఎమ్మెల్యే భరత్సింగ్ (కాంగ్రెస్) మరో వినూత్న పంథా ఎంచుకొన్నారు.
జైపుర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్కు వ్యతిరేకంగా తరచూ ప్రకటనలు చేస్తూ వస్తున్న మాజీ మంత్రి, సాంగోద్ ఎమ్మెల్యే భరత్సింగ్ (కాంగ్రెస్) మరో వినూత్న పంథా ఎంచుకొన్నారు. ‘‘అశోక్ గహ్లోత్ గౌరవం, విశ్వాసం చనిపోయాయి.. అందుకే గుండు చేయించుకొని నా కేశాలు పంపుతున్నా’’ అంటూ ముఖ్యమంత్రికి ఆయన ఓ లేఖ రాస్తూ తల వెంట్రుకలను వాటికి జత చేశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కోటా హెరిటేజ్ రివర్ఫ్రంట్ ప్రారంభోత్సవానికి మంగళవారం అశోక్ గహ్లోత్ హాజరుకావాల్సి ఉండగా.. చివరిదశలో సీఎం పర్యటన రద్దయింది. ‘‘రివర్ఫ్రంట్ ప్రారంభ సందర్భంగా నా అభినందనలు. అశోక్ గహ్లోత్ గాంధీ సిద్ధాంతాలు అనుసరిస్తారు. గనుల మంత్రి ప్రమోద్ జైన్ మరో దారిలో వెళతారు. సీఎం పదవి శాశ్వతం కాదు’’ అని భరత్సింగ్ లేఖలో పేర్కొన్నారు. కోటా జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్