Balineni: మీ పని మీరు చూసుకోండి... నా పనేదో నేను చేసుకుంటా!
వైకాపా నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలోని ఆ పార్టీ వర్గాల్లో చిచ్చురేపింది. మార్కాపురంలో మంగళవారం నిర్వహించిన యాత్రకు హాజరైన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి... కనిగిరిలో బుధవారంనాటి యాత్రకు దూరమయ్యారు.
ఎంపీ విజయసాయిరెడ్డితో బాలినేని షాకింగ్ వ్యాఖ్యలు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: వైకాపా నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలోని ఆ పార్టీ వర్గాల్లో చిచ్చురేపింది. మార్కాపురంలో మంగళవారం నిర్వహించిన యాత్రకు హాజరైన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి... కనిగిరిలో బుధవారంనాటి యాత్రకు దూరమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలూ దూరంగా ఉన్నారు. మార్కాపురం యాత్రకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాలినేని కలిసి ఒకే కారులో వెళ్లారు. శామ్యూల్ జార్జి కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో... వచ్చే ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పోటీచేస్తారని, ఆయనను ఆశీర్వదించాలని పార్టీ ఆంతరంగికులను విజయసాయిరెడ్డి కోరారు. రోజంతా కలిసే ఉన్నా తమకు చెప్పకుండా ఏకపక్షంగా నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై బాలినేని, మరికొందరు నాయకులు చిన్నబుచ్చుకున్నారు. బుధవారం కనిగిరి సభకు వెళ్లేముందు ఎంపీ విజయసాయిరెడ్డి... బాలినేని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బాలినేని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒంగోలులో ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో జిల్లాపై పెత్తనం తనకు ఇస్తానని చెప్పారని, ఇప్పుడు ఏమీ చెప్పకుండా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. తాను కనిగిరి బస్సుయాత్రకు రానని, మీ పని మీరు చూసుకుంటే ఒంగోలులో తన పనేదో తాను చేసుకుంటానని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మార్కాపురం టికెట్ ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సైతం కనిగిరి పర్యటనకు దూరంగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం