ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు

గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై చేబ్రోలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు.

Published : 17 Nov 2023 04:44 IST

ఎఫ్‌ఐఆర్‌లో 14వ నిందితుడిగా చేర్చిన పోలీసులు

చేబ్రోలు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై చేబ్రోలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. పొన్నూరు రూరల్‌ సీఐ రాంబాబు గురువారం ఈ వివరాలు తెలిపారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు అక్కడ సంగం డెయిరీ ఆధ్వర్యంలోని పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారన్నారు. దాని బకాయిలు అడిగేందుకు బుధవారం వారు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందని, బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం రాత్రి 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, 15వ నిందితుడిగా జానకిరామయ్య పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చామన్నారు. ఘటన జరిగిన సమయంలో నరేంద్రకుమార్‌ పొన్నూరులో విలేకర్లతో మాట్లాడుతున్నారని తెదేపా వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని