Balineni Srinivasa Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాశా
‘తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ముందే ఊహించా. వాళ్లకి యాభై సీట్లు కూడా రావు.. బీఆర్ఎస్సే మళ్లీ వస్తుందని వేరొకరంటే నేను కాంగ్రెస్పై రూ.50 లక్షలు పందెం కాశా.
వైకాపా కార్పొరేటర్లు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తానంటేనే మళ్లీ పోటీకి దిగుతా
మంత్రి హోదాలో డబ్బు తీసుకున్నాను
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే : ‘తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ముందే ఊహించా. వాళ్లకి యాభై సీట్లు కూడా రావు.. బీఆర్ఎస్సే మళ్లీ వస్తుందని వేరొకరంటే నేను కాంగ్రెస్పై రూ.50 లక్షలు పందెం కాశా. ఈ విషయం తెలిసి మా అబ్బాయి (ప్రణీత్రెడ్డి) వారించాడు. అక్కడ భారాస వస్తే ఇక్కడ జగన్ మళ్లీ వస్తాడనేది మా వాడి ఆలోచన. ఆ తర్వాత కాంగ్రెస్కు అరవై సీట్లపై మళ్లీ మరోసారి పందెం నా దగ్గరికి వచ్చింది. నాకు రూ.50 లక్షలు వస్తాయనే నమ్మకం ఉన్నా మా అబ్బాయి బాధపడకూడదని వదిలేశా.
ఎంతసేపూ జగన్ రావాలి, జగన్ రావాలి.. ఇదే ఆలోచన నా కుమారుడికి. జగన్ అంటే అంత పిచ్చి మాకు. కానీ, ఆయనకు మాపై ఉండాలిగా.. ఉండాలనే కోరుకుంటున్నా..’ అని మాజీ మంత్రి, వైకాపా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాలినేని ఈ మాటలన్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే తనతో పాటు తన కుటుంబానికి చిరాకు వస్తోందని.. తన కుమారుణ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ‘కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. రాబోయే ఎన్నికల్లో ఓ వర్గం రోడ్ల మీదకు వచ్చి పనిచేస్తుంది. మీరంతా నా కోసం గట్టిగా కృషి చేస్తానంటేనే మళ్లీ పోటీ చేస్తా.. లేదంటే మంచి వ్యక్తిగా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలనే ఆలోచన ఉంది’ అని అన్నారు. ‘అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. నేను నీతిమంతుణ్ని.. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని చెప్పను. అబద్ధం చెప్పటం నాకు ఇష్టం ఉండదు. ఎమ్మెల్యేగా ఒంగోలు నియోజకవర్గంలో ఎవరి దగ్గర నుంచీ రూపాయి కూడా తీసుకోలేదు. మంత్రి పదవిలో మాత్రం డబ్బులు తీసుకున్నా’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట