వైకాపాకు అభ్యర్థుల్లేక ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తున్నారు: అచ్చెన్నాయుడు

రానున్న ఎన్నికల్లో వైకాపాకు పోటీ చేసేందుకు అభ్యర్థుల్లేక ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

Updated : 15 Jan 2024 07:23 IST

టెక్కలి, కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో వైకాపాకు పోటీ చేసేందుకు అభ్యర్థుల్లేక ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఆదివారం భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ప్రజావ్యతిరేక ప్రభుత్వ జీవో ప్రతులను ఎంపీ రామ్మోహన్‌నాయుడితో కలసి భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రమాదాన్ని కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని