TDP: సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం
లోక్సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు.
ప్రశ్నలు అడగడంలో 4వ స్థానం
వెల్లడించిన ఏడీఆర్
ఈనాడు, దిల్లీ: లోక్సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. 17వ లోక్సభ 273 రోజులు నడవగా తెదేపా ఎంపీలు సగటున 229 రోజులు సభకు హాజరై అన్ని పార్టీల కంటే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీలు 12 (సగటున 185 రోజుల హాజరుతో), తెరాస ఎంపీలు 13 (సగటున 181 రోజులు)వ స్థానాల్లో ఉన్నారు. అత్యధిక రోజులు సభకు హాజరైన వారిలో తెదేపా తర్వాత స్థానం సీపీఎం సభ్యులదే (సగటున 226 రోజులు). 17వ లోక్సభ పనితీరును విశ్లేషిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ప్రశ్నలు వేయడంలోనూ తెదేపా ఎంపీలు టాప్5లో నిలిచారు. ఎన్సీపీ, శివసేన, ఎంఐఎం తర్వాత అత్యధిక ప్రశ్నలు అడిగినది తెదేపాకు చెందిన ఎంపీలే కావడం గమనార్హం. ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు సభ్యులు సగటున 247 ప్రశ్నలు సంధించారు. ఈ విషయంలో వైకాపా 6, (సగటున 234), తెరాస 8వ (సగటున 211) స్థానాల్లో నిలిచాయి. నరసాపురం నుంచి ప్రాతినిథ్యం వహించిన రఘురామకృష్ణరాజు లోక్సభ జరిగిన 273 రోజుల్లో 267 రోజులు సభకు హాజరై (97.8%) వ్యక్తిగతంగా 17వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం 341 ప్రశ్నలు అడిగారు. తెదేపా పార్లమెంటరీ పార్టీనేత జయదేవ్ గల్లా సగటున 236 రోజులు హాజరై(86.4%), 291 ప్రశ్నలు వేసి 181వ స్థానంలో నిలిచారు. వైకాపా లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి 185 రోజులు హాజరై..302 ప్రశ్నలు వేసి 377వ స్థానానికి పరిమితమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత