వైకాపా పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు
జగన్ పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్సూర్య ధ్వజమెత్తారు.
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్సూర్య
ఈనాడు డిజిటల్, అమరావతి: జగన్ పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్సూర్య ధ్వజమెత్తారు. బ్రాహ్మణులు, అర్చకుల్ని అణగదొక్కి తద్వారా హిందూ మతాన్ని నాశనం చేయాలనేదే జగన్ కుట్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో అర్చకులపై వైకాపా నేత దాడి ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు చేయకపోతే కొడతారా? పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరాలయంలో అర్చకుడి యజ్ఞోపవీతాన్ని వైకాపా నేత యుగంధర్ తెంచేశాడు. కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో ఆలయ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి అర్చకులపై దాడి చేసి, కొట్టారు. కోటప్పకొండలోనూ వైకాపా నాయకుడికి మర్యాద చేయలేదని అర్చకుడిపై దాడికి తెగబడ్డారు. వైకాపా నాయకుల భూ ఆక్రమణతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు’’ అని ఆనంద్సూర్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.