భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకి మద్దతుగా లోకేశ్ ప్రచారం
తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రచారం చేయనున్నారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రచారం చేయనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్షోల్లో పాల్గొంటారు. గురువారం రాత్రి 7 గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్లో శుక్రవారం ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశమవుతారు.
‘శకారంభం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన లోకేశ్
యువగళం పాదయాత్రపై సీనియర్ పాత్రికేయుడు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన ‘శకారంభం’ పుస్తకాన్ని లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి అగనంపూడిలో ముగింపు వరకు చోటుచేసుకున్న కీలక పరిణామాల్ని రచయిత పుస్తకంలో ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.