రాష్ట్రంలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం: కె.లక్ష్మణ్‌

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Published : 18 Apr 2024 04:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలూ కేంద్రంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో నాలుగు నెలలకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాగ్రహం ఎదుర్కోంటోంది. అది చూసి సీఎం రేవంత్‌రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారు. దేశంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ గత చరిత్రగానే మిగిలిపోతుంది. భారాస ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది. మా అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో భాజపా జాతీయ నాయకులు, ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. శుక్రవారం కిషన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొంటారు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని