Harish Rao: భారాసపై బురదజల్లేందుకే మేడిగడ్డ పర్యటన: హరీశ్రావు
రాజకీయ లబ్ధి కోసమే సీఎం, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్తున్నారని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు.
హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే సీఎం, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్తున్నారని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు (Harishrao) ఆరోపించారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారన్నారు. దీన్ని ఖండిస్తున్నామని.. ఇది ప్రజాస్వామ్య విలువలను మంటగలపడమేనని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
‘‘ఎజెండాలో లేని అంశాలపై అధికార పార్టీ సభ్యులు ఇష్టారీతిన మాట్లాడారు. అది సభాసంప్రదాయాలకు విరుద్ధం. మేడిగడ్డ విషయంలో భారాసపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. బ్యారేజీ పర్యటనకు వెళ్లే మార్గంలో రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కూడవెల్లి వాగు, పచ్చటి పొలాలను కూడా చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిజాలు చెప్పకుండా ఒక్క సంఘటన తీసుకుని ఆరోపణలు చేస్తున్నారు. బ్యారేజీ వద్ద లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలి’’ అని హరీశ్రావు అన్నారు.
నల్గొండ సభకు బయల్దేరిన భారాస నేతలు
ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తోందంటూ నల్గొండలో భారాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు హైదరాబాద్ నుంచి నేతలు తరలివెళ్లారు. తెలంగాణ భవన్ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు వాహనాల్లో బయల్దేరారు. ఎన్నికల తర్వాత భారాస అధినేత కేసీఆర్ పాల్గొంటున్న సభ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!