Punjab: పంజాబ్ కాంగ్రెస్లో మరో మార్పు.. ఇంఛార్జిగా హరీశ్ చౌదరి నియామకం
పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న హరీశ్ రావత్ను తొలగించిన కాంగ్రెస్ ఆయన స్థానంలో పంజాబ్ ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్న రాజస్థాన్ ఆర్థిక మంత్రి హరీశ్ చౌదరిని నియమించింది......
దిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న హరీశ్ రావత్ను తొలగించి మరో వ్యక్తిని నియమించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. హరీశ్ రావత్ను తొలగించిన కాంగ్రెస్ ఆయన స్థానంలో పంజాబ్ ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్న రాజస్థాన్ ఆర్థిక మంత్రి హరీశ్ చౌదరిని నియమించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా రావత్ కొనసాగనున్నట్లు తెలిపింది. పంజాబ్తోపాటు ఉత్తరాఖండ్లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘పంజాబ్, చండీగఢ్ ఏఐసీసీ ఇంఛార్జిగా కాంగ్రెస్ హరీశ్ చౌదరిని నియమించింది. ఇప్పటివరకు సేవలందించిన హరీష్ రావత్కు ఉపశమనం కలిగించింది. ఆయన సీడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగుతారు. ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన కృషిని పార్టీ ప్రశంసిస్తోంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
హరీశ్ రావత్ కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీని కలిసిన రెండు రోజులకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించేందుకు పంజాబ్ ఇంఛార్జి పదవి నుంచి తనకు ఉపశమనం కలిగించాలని రాహుల్ గాంధీని రావత్ కోరినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం రావత్ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘నా జన్మభూమికి న్యాయం చేయగలిగితేనే నా కర్మభూమికి న్యాయం చేయగలుగుతా. పంజాబ్ కాంగ్రెస్తోపాటు ఆ రాష్ట్ర ప్రజల నిరంతర దీవెనలు, వారి మద్దతుకు కృతజ్ఞుడిని. రాబోయే కొద్ది నెలల్లో ఉత్తరాఖండ్కి పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నా. ఇందుకోసం పంజాబ్లో నా ప్రస్తుత బాధ్యత నుంచి నేను విముక్తి పొందాలనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా