Shiv Sena: రౌత్.. నోరు అదుపులో పెట్టుకో: భాజపా
పార్టీ గుర్తు వ్యవహారంలో ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గానికి చెందిన ఎంపీ సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) ఘాటుగా స్పందించింది. హద్దుల్లో ఉండాలని హితవు పలికింది.
ముంబయి: శివసేన పార్టీ పేరు, గుర్తు ‘విల్లు-బాణం’ కోసం రూ.2000 కోట్ల మేర ఒప్పందం జరిగిందంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలు చేయడంపై భాజపా మండిపడింది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని.. నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. ‘‘ సంజయ్ రౌత్.. నీ హద్దుల్లో ఉండు. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. ఉద్ధవ్ ఠాక్రే ఏ ఎన్నికల్లోనూ గెలవలేరు. కనీసం పోటీ కూడా చేయలేరు. ఆ వ్యక్తి నిరుత్సాహానికి గురై ఏదేదో చెబుతున్నారు’’ అంటూ ముంబయి భాజపా అధ్యక్షుడు ఆశిష్ షెలార్ విమర్శించారు. ఉద్ధవ్ వర్గం నేతలు నోటిని అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
శివసేన పార్టీ అధికారిక గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న తర్వాత.. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భాజపా శిందే వర్గానికి వత్తాసు పలికిందని, అందులో భాగంగా ఈసీ శివసేన ‘విల్లు-బాణం’ గుర్తును శిందే వర్గానికి కేటాయించిందని ఆరోపించింది. ఓ వైపు ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. ఆగమేఘాల మీద ఈసీ ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి శిందే వర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పార్టీ గుర్తును కొనుగోలు చేసేందుకు శిందే వర్గం రూ.2000 కోట్లకు ఒప్పందం చేసుకుందని సంజయ్ రౌత్ ఆరోపించగా.. శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సదా సర్వాంకర్.. ఈ ఆరోపణలను ఖండించారు. అలా చెప్పడానికి సంజయ్ రౌత్ ఏమన్న క్యాషియరా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. తాజాగా ఆశిష్ షెలార్ ఘాటుగా హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు