PM Modi: వారి సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్
PM Modi: ‘శక్తి’ని నిర్వీర్యం చేస్తామంటూ విపక్ష కూటమి తమ మేనిఫెస్టోలో చెబుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. శక్తిని ఆరాధించేవారికి, నాశనం చేయాలనుకునేవారి మధ్యే ఈ పోరాటం అని అన్నారు.
జగిత్యాల: ‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) తాజాగా స్పందిస్తూ విపక్షాలను ఎండగట్టారు. ‘శక్తి’ని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె దాని స్వరూపమే అని అన్నారు.
జగిత్యాలలో జరిగిన భాజపా (BJP) ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత విపక్ష కూటమి ముంబయిలో ర్యాలీ నిర్వహించి తమ మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ‘శక్తి’కి వ్యతిరేకంగా పోరాడుతామని వారు పేర్కొన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రతి మహిళ, కుమార్తె దాని స్వరూపమే. అందుకే మనమంతా వారిని ఆరాధిస్తాం. అసలు దానిని నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. వారి సవాల్ను నేను స్వీకరిస్తున్నా. మన తల్లులు, కుమార్తెలను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే’’ అని మోదీ వెల్లడించారు.
భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
మన దేశం చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా దిగిన ప్రాంతానికీ ‘శివ శక్తి’ పేరు పెట్టినట్లు ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో శక్తిని ఆరాధించే వారికి, దాన్ని నాశనం చేస్తామని చెప్పేవారి మధ్యే పోరాటం అని తెలిపారు. ఇందులో ఎవరు గెలుస్తారనేది జూన్ 4నే తెలుస్తుందని అన్నారు.
ముంబయిలో ఆదివారం జరిగిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. ‘‘మోదీపై మా పోరాటం వ్యక్తిగతంగా కాదు. శక్తి (అధికారం)కి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. ఇక్కడ అధికారం అంటే ఏంటీ?అనేదే అసలైన ప్రశ్న. రాజు (మోదీని ఉద్దేశిస్తూ) ఆత్మ ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను సంస్థల్లో ఉంది. అవి లేకుండా ఆయన గెలవలేరు’’ అని ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఇవి కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా