PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
జగిత్యాల: ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆరంభంలో కాసేపు తెలుగులో ప్రసంగించి మోదీ అందరినీ ఉత్సాహపరిచారు.
‘‘దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో భాజపాకు ప్రజల మద్దతు పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడు రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారి. రాష్ట్రంలో భాజపా పెరుగుతోంది.. కాంగ్రెస్, భారాస తగ్గుతున్నాయి. రానున్న ఎన్నికల్లో మా పార్టీకి దేశవ్యాప్తంగా 400లకు పైగా సీట్లు రావడం ఖాయం. నేను భారతమాత పూజారిని. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. ఇక్కడి ప్రజలను భారాస దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు. భారాస దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు దిల్లీ చేరుతోంది’’
‘‘కాంగ్రెస్, భారాస రెండూ మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. తెలంగాణను దోచుకున్న వారిని మేం విడిచిపెట్టేది లేదు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు ఉంది. ఇప్పుడు అలాంటి పార్టీల జాబితాలో భారాస చేరింది. ఆ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో, దిల్లీ మద్యం వ్యవహారంలో అవినీతికి పాల్పడింది’’ అని మోదీ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ