NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్
భాజపా సారథ్యంలోని ఎన్డీయేలో జేడీఎస్ చేరింది. ఈ చేరికతో ప్రధాని నరేంద్ర మోదీ విజన్ మరింత బలోపేతమవుతుందని నడ్డా పేర్కొన్నారు.
దిల్లీ: లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ(JDS Party) భాజపా (BJP)సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. భాజపా అగ్రనేతలు అమిత్ షా(Amit shah), జేపీ నడ్డా(JP Nadda)తో భేటీ అనంతరం జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ కీలక భేటీ సమయంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా అక్కడే ఉన్నారు. ఈ తాజా పరిణామంతో కర్ణాటకలో భాజపా, జేడీఎస్ మధ్య పొత్తు పొడుపులపై గత కొన్నాళ్లుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే, కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.
జేపీ నడ్డా ట్వీట్..
ఈ అంశంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సమావేశమయ్యారన్నారు. జేడీఎస్ ఎన్డీయేలో భాగస్వామి కావాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జేడీఎస్ను హృదయపూర్వకంగా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోదీ ‘న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా’ విజన్ను బలోపేతం చేస్తుందని నడ్డా ట్వీట్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జేడీఎస్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాజపా సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్, భాజపా మధ్య పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి మాండ్యతో పాటు మరో మూడు లోక్సభ సీట్లు ఇస్తామని కూడా ఆయన ఆ సందర్భంలో అన్నారు. ఆ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తులపై పలు రకరకాల ఊహాగానాలు కొనసాగిన అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు