కాంగ్రెస్‌లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్‌

పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్‌ గోశిక పాండులు కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Published : 09 May 2024 06:19 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్‌ గోశిక పాండులు కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి జగదీశ్‌ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి కూడా పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని