భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్‌రెడ్డి

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలవనున్నారు.

Published : 09 May 2024 06:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలవనున్నారు. ఈ మేరకు భాజపా బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆయన గురువారం నామినేషన్‌ వేయనున్నారని.. కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సహా ఇతర నేతలు పాల్గొంటున్నట్లు పేర్కొంది. హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ప్రేమేందర్‌రెడ్డి 1980లో ఏబీవీపీలో చేరారు. 1994 నుంచి భాజపాలో వేర్వేరు హోదాల్లో పని చేస్తున్నారు. ఆయన 2021లో జరిగిన ఇదే పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు