Bommai: ఆస్తుల వివరాలు ప్రకటించిన కర్ణాటక సీఎం బొమ్మై.. విలువెంతో తెలుసా..!
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తన ఆస్తుల విలువ రూ.49.70 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. హవేరీ జిల్లాలోని షిగ్గావ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో రాజకీయ సందడి ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రక్రియ క్రమంలో నామినేషన్ (Nominations)ల పర్వం ఇప్పటికే మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) హవేరీ జిల్లాలోని షిగ్గావ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రిటర్నింగ్ అధికారి ముందు ఎన్నికల అఫిడవిట్ (Election Affidavit) దాఖలు చేశారు. ఇందులో బసవరాజ్ బొమ్మై తన ఆస్తుల విలువ రూ.49.70 కోట్లుగా పొందుపరిచారు.
బొమ్మై వద్ద రూ.5.98 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దీంతోపాటు హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి రూ.1.57 కోట్ల సంపద దక్కింది. ఆయన భార్య చన్నమ్మ పేరిట రూ.1.14 కోట్లు, కూతురు అదితి పేరిట రూ.1.12 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కుమారుడు భరత్ బొమ్మై తన తండ్రిపై ఆధారపడనందున.. అతని ఆస్తుల వివరాలను పేర్కొనలేదు. అయితే, బసవరాజ్ బొమ్మై తన కుమారుడికి రూ.14.74 లక్షలు ఇచ్చినట్లు ప్రస్తావించారు.
ముఖ్యమంత్రికి రూ.42.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి రూ.19.2 కోట్ల ఆస్తి వచ్చింది. రూ.5.79 అప్పులు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత.. ధార్వాడ్లోని హుబ్బళ్లి తాలూకా తరిహాల గ్రామంలో దాదాపు మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా బసవరాజ్ బొమ్మై, ఆయనపై ఆధారపడిన వారి ఆస్తుల విలువ రూ.52.12 కోట్లుగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ