Goa polls: మనోహర్ పారికర్ తనయుడికిభాజపాలో నిరాశ.. కేజ్రీవాల్ ఆఫర్!
గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్కు భాజపాలో నిరాశ ఎదురైంది. మరికొద్ది వారాల్లో జరగబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం......
పనాజీ: గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్కు భాజపాలో నిరాశ ఎదురైంది. మరికొద్ది వారాల్లో జరగబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన ఉత్పల్కు పార్టీ టికెట్ నిరాకరించింది. పాతికేళ్లుగా పారికర్ గెలుస్తూ రికార్టు సృష్టించిన పనాజీ స్థానాన్ని ఎమ్మెల్యే అటానాసియో బాబుష్ మాన్సెరేట్కు కేటాయించింది. ఈ మేరకు 34మంది అభ్యర్థుల జాబితాను భాజపా గోవా వ్యవహారాల ఇన్ఛార్జి దేవేంద్ర ఫడణవీస్ గురువారం విడుదల చేశారు. అయితే, తన తండ్రిని ఆదరించిన సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉత్పల్ను అడ్డుకోవాలని భాజపా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన అక్కడి నుంచే పోటీచేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా తన వైఖరిని త్వరలోనే తెలియజేస్తానని కూడా ఉత్పల్ ప్రకటించడంతో గోవా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఉత్పల్ను తమ పార్టీ టికెట్పైనే మరో స్థానం నుంచి పోటీ చేసేలా ఆయనకు నచ్చజెప్పేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఉత్పల్కు కేజ్రీవాల్ ఆహ్వానం..
మరోవైపు, గోవాలో అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా శ్రమిస్తున్న ఆప్ అక్కడి పరిణామాలపై చురుగ్గా స్పందించింది. ఉత్పల్ పారికర్కు పనాజీ టికెట్ ఇచ్చేందుకు భాజపా నిరాకరించడంతో ఆప్ రంగంలోకి దిగింది. ఉత్పల్ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పారికర్ కుటుంబం పట్ల భాజపా అవలంబించిన తీరు గోవా ప్రజల్ని ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. మనోహర్ పారికర్ అంటే తనకు ఎల్లప్పుడూ ఎంతో గౌరవమని తెలిపారు. ఉత్పల్ తమ పార్టీలో చేరి ఆప్ టికెట్పై పోటీ చేసేందుకు సాదరంగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
గోవాలో భాజపాకు అంతా తానై నడిపించిన మనోహర్ పారికర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేతగా ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. గోవాకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పనాజీ స్థానం నుంచి దాదాపు పాతికేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మనోహర్ పారికర్ 2019లో కన్నుమూశారు. అయితే, అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అటానాసియో బాబుష్ మాన్సెరేట్ కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. ఆ తర్వాత ఆయన భాజపాలోకి ఫిరాయించారు. తాజాగా అటానాసియోకే పనాజీ టికెట్ను భాజపా కేటాయించడం గమనార్హం. మొత్తం 40 స్థానాలు కలిగిన గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!