Kishan Reddy: కేసీఆర్కు రామగుండం వచ్చే తీరిక లేదు.. కానీ నాందేడ్ వెళ్తున్నారు: కిషన్రెడ్డి
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ పునరుద్ధరిస్తే.. ప్రారంభోత్సవానికి వచ్చే తీరిక కూడా సీఎం కేసీఆర్కు లేకుండా పోయిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగే సభలు, సమావేశాలకు వెళ్లేందుకు మాత్రం ఆయనకు సమయం దొరుకుతుందని విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని.. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత భారాస ప్రభుత్వంపై ఉందని చెప్పారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పంటల బీమాను అమలు చేస్తున్నాయని.. తెలంగాణ కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు.
‘‘రోజూ కేంద్రం, ప్రధాని మోదీని తిట్టడమే కల్వకుంట్ల కుటుంబం పనిగా పెట్టుకుంది. అధికారులకు కాకుండా సలహాదారులకు సీఎం కేసీఆర్ పాలనాధికారాలను కట్టబెట్టారు. పాలనను వదిలేసి ఆయన మహారాష్ట్రలో భారాస సభలు, సమావేశాల పేరుతో తిరుగుతున్నారు. కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి అమలుచేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఆయన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మహారాష్ట్రకు వెళ్లి మోదీని విమర్శిస్తున్నారు. రైతులకు కేంద్రం యూరియా, ఎరువులపై సబ్సిడీ ఇస్తోంది.. అది రైతులకే దక్కాలి. సబ్సిడీలు దళారీలకు దక్కకుండా చూడటమే మోదీ లక్ష్యం. కేంద్రం సబ్సిడీ ద్వారా ఇచ్చిన ట్రాక్టర్లను భారాస నేతలే పంచుకున్నారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ పునరుద్ధరిస్తే.. ప్రారంభోత్సవానికి వచ్చే తీరిక కూడా కేసీఆర్కు లేకుండా పోయింది. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగే సభలు, సమావేశాలకు వెళ్లేందుకు మాత్రం ఆయనకు సమయం దొరుకుతుంది. కేంద్రం ధాన్యం కొనడం లేదని రాష్ట్ర మంత్రులు దిల్లీ వచ్చి ధర్నాలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాన్నే పూర్తిచేయలేదు’’ అని కిషన్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!