Kishan reddy: కేంద్ర మంత్రి పదవిపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కిషన్‌ రెడ్డి

తెలంగాణ భాజపా చీఫ్‌గా బాధ్యతలు ప్రకటించిన తర్వాత.. తొలిసారి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 05 Jul 2023 14:55 IST

దిల్లీ: తెలంగాణ భాజపా చీఫ్‌గా బాధ్యతలు ప్రకటించిన తర్వాత.. తొలిసారి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను పార్టీకి విధేయుడిని. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతా. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపడతాను. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటా’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర కేబినేట్ భేటీకి వెళ్లకుండా కిషన్‌ రెడ్డి దిల్లీలోని తన నివాసంలోనే ఉన్నారు.

ఇవాళ సాయంత్రం కిషన్‌ రెడ్డి దిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనపై వారితో చర్చించే అవకాశం ఉంది. గురువారం ఉదయం కిషన్ రెడ్డి వరంగల్‌కు వెళ్తారు. జులై 8వ తేదీ వరకు కిషన్‌ రెడ్డి వరంగల్‌లోనే ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని