Kishan reddy: సర్వేలు చేసి.. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారు: కిషన్రెడ్డి
నిజామాద్ భాజపా ఎంపీ అర్వింద్ నివాసంపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఖండించారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసానికి వెళ్లి మంత్రి దాడి జరిగిన తీరును పరిశీలించారు.
హైదరాబాద్: నిజామాబాద్ భాజపా ఎంపీ అర్వింద్ నివాసంపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఖండించారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అర్వింద్ నివాసంపై అధికార పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య. ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? రాజధాని నడిబొడ్డున ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసించే ఎమ్మెల్యే కాలనీలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం చేసుకోవచ్చు.
అధికార పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి, అహంకారపూరితమైన పరిపాలనకు ఇదే నిదర్శనం. నిరాశ.. నిస్పృహలో, అభద్రతా భావంతో తెరాస దాడులకు పాల్పడుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు వరకు సర్వేలు ఆపాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నా. సర్వేలు చేసి అభద్రతా భావంతో, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. పోలీసులు, మజ్లిస్ను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారు. తెరాస దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవాలనే కోరిక మాకు లేదు. భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం మాకు లేదు. ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టాలంటే మొదట కేసీఆర్ మీదే పెట్టాలి. ఆయన ఇప్పటికే ఎన్ని పార్టీల గొంతు నొక్కారో అందరికీ తెలుసు. దేశంలో ఇతర పార్టీల మెప్పు కోసమే కేసీఆర్ ప్రయత్నాలు. మోదీని ఢీకొంటున్నట్టు ఇతరులు అనుకోవాలనే ఈ చర్యలు’’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చట్టసభల్లో పవన్ గొంతు వినాలి: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!