TS News: 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే పోరాటమే: కేటీఆర్
హైదరాబాద్ ప్రజలు తెలివిగా ఆలోచించి కాంగ్రెస్కు ఒక్క సీటు ఇవ్వకుండా 16 సీట్లు తమకే ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇబ్రహీంపట్నం: ‘‘హైదరాబాద్ ప్రజలు తెలివిగా ఆలోచించి కాంగ్రెస్కు ఒక్క సీటు ఇవ్వకుండా 16 సీట్లు మనకే ఇచ్చారు. కానీ, నగరానికి పక్కనే ఉన్న నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి వారికి ఓట్లు వేశారు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఓ గార్డెన్లో నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ భారాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ నేతలు అభయహస్తం, డిక్లరేషన్ అంటూ అన్ని కలిపి 420 హామీలు ఇచ్చారు. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంటికి ఒక్కటే అంటున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 1.67 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ఈ పథకం వర్తించాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటం చేయాలి. పోయింది అధికారం మాత్రమే.. పోరాట పటిమ కాదు. భువనగిరి పార్లమెంట్ సీటు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈసారి అక్కడ విజయం సాధించాలి. ఇందుకోసం మనమంతా కసిగా పనిచేయాలి. పోలీసు కేసులు పెడతారు.. అయినా భయపడవద్దు. మీకోసం అందరం వచ్చి పోరాడతాం’’ అని కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, భారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM