DK Shivakumar: మరో సర్వే చేశాకే లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన: డీకేఎస్‌

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో మరో దఫా సర్వే నిర్వహించాకే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు.

Published : 14 Feb 2024 20:35 IST

బెంగళూరు: మరో దఫా సర్వే నిర్వహించిన తర్వాతే తమ రాష్ట్రం నుంచి లోక్‌సభ  అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK shivakumar) అన్నారు. సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,  కాంగ్రెస్‌ కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జి రణ్‌దీప్‌ సూర్జేవాలతో పాటు పలువురు నేతలతో బుధవారం ఆయన బెంగళూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. పార్టీ జిల్లా కార్యదర్శులు, కార్యకర్తలు సమర్పించిన సర్వే నివేదికలపై చర్చించామన్నారు. మరో దఫా సర్వే కూడా చేయాలని కోరాం. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైతే తుది జాబితా ఖరారు కాలేదని.. తదుపరి సమావేశం దిల్లీలో జరుగుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని