Congress: తెలంగాణ ప్రజలకు థాంక్స్‌.. 4 రాష్ట్రాల ఫలితాలపై ఖర్గే రియాక్షన్‌ ఇదే..

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.

Published : 03 Dec 2023 16:35 IST

దిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తెలంగాణలో తమ పార్టీకి అవకాశం కల్పిస్తూ తీర్పు ఇచ్చిన ప్రజలకు  కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రతిఒక్కరికీ థాంక్స్‌ చెబుతూ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.  తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకి వచ్చిన ఫలితాలు నిస్సందేహంగా నిరుత్సాహానికి గురిచేశాయన్నారు. కానీ మరింత దృఢ నిశ్చయంతో ఈ మూడు రాష్ట్రాల్లో తమను తాము పునర్నిర్మించుకొనేందుకు పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ఉత్సాహంగా పోరాడిందని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం లక్షలాది మంది కార్యకర్తలు చేసిన కృషిని ప్రశంసించారు. తాత్కాలికంగా ఎదురైన ఈ ఒడుదొడుకులను అధిగమించి.. ఇండియా కూటమి పార్టీలతో కలిసి వచ్చే  వారితో లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని