AP News: ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. 

Published : 19 Mar 2024 15:02 IST

ఒంగోలు: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల సంక్షేమం పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదని, ఇటీవల ప్రకటించిన పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. 

‘‘జగన్‌ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దయ్యాయి. గతంలో ఉన్న విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు తీసేసి జగన్‌ పేరు పెట్టడమేంటి? గత ప్రభుత్వం మాదిగ కులానికి ప్రాధాన్యమిచ్చింది. నరేంద్ర మోదీ కూడా మమ్మల్ని గుర్తించారు. అందుకే ఈ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతు ఇస్తాం. త్వరలో కూటమి అగ్ర నేతలను కలిసి మాట్లాడతా’’అని మందకృష్ణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని