Mega Fans: మేమంతా జనసేన వెంటే..: ‘మెగా’ అభిమానుల నిర్ణయం
జనసేన అధినేత పవన్కల్యాణ్ వెంట నడవాలని ‘మెగా’ అభిమానులు నిర్ణయించారు. విజయవాడలోని ఓ హోటల్లో చిరంజీవి, పవన్కల్యాణ్, రామ్చరణ్ అభిమానులు సమావేశమయ్యారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్కల్యాణ్ వెంట నడవాలని ‘మెగా’ అభిమానులు నిర్ణయించారు. విజయవాడలోని ఓ హోటల్లో చిరంజీవి, పవన్కల్యాణ్, రామ్చరణ్ అభిమానులు సమావేశమయ్యారు. అనంతరం అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు మీడియాతో మాట్లాడారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమవంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. 2024లో పవన్ కల్యాణ్ను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకెళతామని.. మెగా అభిమానులంతా జనసేన కార్యకర్తలుగా పనిచేస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు. -
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది.