Kishan Reddy: భారాస నేతల అక్రమాలకు బంగారు గని బలైపోతోంది: కిషన్రెడ్డి
సింగరేణి సంస్థలో సీఎం కుటుంబం, భారాస నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా, టెండర్లు వేయకుండా తమ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్: కార్మికుల కష్టార్జితంతో కొనసాగుతున్న సింగరేణి సంస్థను భారాస సర్కార్ భక్షించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబం, భారాస నేతల అక్రమాలకు తెలంగాణ బంగారు గని బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేని రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణి సొమ్మును విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెడతామని చూస్తే కార్మికులు సహించబోరని కిషన్రెడ్డి హెచ్చరించారు. ఈమేరకు దిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘తెలంగాణ ఉద్యమంలో సింగరేణిని సాధించు, రక్షించు అనే నినాదాన్ని కేసీఆర్ తీసుకున్నారు. కానీ, ఈరోజు భక్షించే విధానాన్ని అమలు చేస్తున్నారు. 2014లో రూ.3,500 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్తో సింగరేణి కొనసాగేది. ప్రస్తుతం సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ.10వేల కోట్లు దాటింది. భారాస చేతకాని తనంతో సింగరేణి అప్పులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంస్థలో సీఎం కుటుంబం, భారాస నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణలో బొగ్గు గనుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనట్లేదు. టెండర్లు కూడా వేయకుండా తమ బాధ్యతను విస్మరించారు’’ అని కిషన్రెడ్డి ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!